Connect with us

Hi, what are you looking for?

National News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము – విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు…

Share

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందులోనూ ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా ఆ గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్లు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.15 వరకు జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, విభిన్న అంశాలు, అభ్యర్థుల పేర్లపై చర్చించి చివరకు ఆమెను ఖరారు చేశారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఈమె పేరు 2017లోనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ ఉన్నారు. అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ అవుతారు. 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించిన ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో బీజేపీ , బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. భాజపా నాయకత్వం పూర్తిగా సామాజిక కోణంలోనే ఆమె ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. అణగారిన వర్గాలకు, అదీ కాకుండా మహిళకు అవకాశం కల్పిస్తే సముచితంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాల విశ్లేషణ.ఆమె ఎంపిక ఎందుకంటే..

ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అగ్రవర్ణాలు, ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గానికి చెందినవారు చేపట్టినా ఎస్టీలు మాత్రం రైసినా హిల్‌ మెట్లు ఎక్కలేదు. దేశ అత్యున్నత పదవిని అప్పగించిన గౌరవాన్ని భాజపా ఖాతాలో వేసుకోవడానికే ద్రౌపదీ ముర్మూని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది జరిగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి బలమైన సంకేతం ఇవ్వడానికి ఈమెను తీసుకొచ్చారన్న భావన వినిపిస్తోంది. ఎలక్టొరల్‌ కాలేజిలో ఎన్డీయేకి 58% ఓట్లు ఉన్నందువల్ల ముర్మూ గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పక్షం భావిస్తోంది. ముర్మూ సోమవారమే 64వ పుట్టినరోజు చేసుకున్నారు. నెగ్గితే రాష్ట్రపతులందరిలో పిన్న వయస్కురాలు ఆమే అవుతారు. ఆమె పేరును ప్రకటించే ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తోనూ భాజపా సంప్రదించింది. దరిమిలా ఆమెకు బిజద మద్దతు ప్రకటించింది.

వెంకయ్యనాయుడి పేరుపై విస్తృత ప్రచారం

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని ఆగమేఘాల మీద దిల్లీకి రప్పించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఆయన్ని కలవడంతో రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వంపై ఒక దశలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలేవీ ధ్రువీకరించలేదు. ఆయనతో వారు ఏం మాట్లాడారన్నదీ బయటికి రాలేదు. అధికార కూటమికి చెందిన ఉపరాష్ట్రపతి ఉంటే తదుపరి రాష్ట్రపతి ఎన్నికల్లో వారికే పదోన్నతి కల్పించడం ఇదివరకు ఆనవాయితీగా కొనసాగింది. 2007లో బీజేపీ కూటమికి మెజార్టీ లేకపోయినా అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న భైరాన్‌సింగ్‌ షెకావత్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. భాజపా ఈసారి అలాంటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చింది.

కొత్త తరం నేతలకు ప్రోత్సాహం

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత తరం నాయకులను కాకుండా కొత్తతరం వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోనూ, గవర్నర్ల నియామకంలోనూ ఇదే పంథా కొనసాగుతూ వస్తోంది. వాజ్‌పేయీ హయాంలో పనిచేసిన వారిలో కేంద్ర మంత్రివర్గంలో రాజ్‌నాథ్‌సింగ్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, నితిన్‌ గడ్కరీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కొత్త కొలమానాలు, సరికొత్త సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ద్రౌపదీ ముర్మూను అదృష్టం వరించింది. ఇదివరకు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఉత్తర, దక్షిణ భారతదేశాలన్న కొలమానాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భాజపా నాయకత్వం కొత్తగా తూర్పు భారతాన్ని తెరమీదికి తెచ్చింది. రాష్ట్రపతులుగా చేసిన వారిలో ప్రణబ్‌ముఖర్జీ తూర్పు భారతానికి చెందిన పశ్చిమ బెంగాల్‌వారే. అయినప్పటికీ మంగళవారం ద్రౌపదీ ముర్మూ పేరు ప్రకటించేటప్పుడు జేపీ నడ్డా.. తూర్పు భారతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమె పేరును ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాకే ప్రకటన

“20 పేర్లపై విస్తృత చర్చ జరిగింది. కానీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలనీ, వీలైతే మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కోణాల్లో ద్రౌపదీ ముర్మూ పేరును ఖరారు చేశాం. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించి కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా ఆమె పనిచేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కంఠ్‌ అవార్డు అందుకున్నారు. విద్యను నమ్ముకొని జీవితంలో పైకెదిగారు. అప్పగించిన బాధ్యతలన్నింటినీ ఉత్తమంగా నిర్వర్తించారు. అందుకే ఎన్డీయే భాగస్వాములన్నింటితో మాట్లాడిన తర్వాత ఆమె పేరు ప్రకటిస్తున్నాం” అని నడ్డా వెల్లడించారు. ముర్మూ బాల్యం నుంచి సంఘ్‌ పరివార్‌తో సన్నిహితంగా ఉన్నారు. విద్యాభ్యాసం తర్వాత సేవారంగంలో ప్రవేశించి మయూర్‌భంజ్‌ ఆదివాసీల హితం కోసం ఉద్యమించారు. 2021 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

“ద్రౌపదీ ముర్మూ తన జీవితాన్ని సమాజ సేవ, పేదల సాధికారత, అట్టడుగు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. పాలనలో ఆమెకు మంచి అనుభవం ఉంది. ఆమె ఈ దేశానికి గొప్ప రాష్ట్రపతి కాగలరన్న నమ్మకం నాకుంది. పేదరికం, కష్టనష్టాలు ఎదుర్కొంటున్న కోట్లమంది ప్రజలు ద్రౌపదీ ముర్మూ జీవితం నుంచి గొప్ప స్ఫూర్తిని పొందుతారు. విధానాలపట్ల ఆమెకున్న అవగాహన దేశానికి గొప్ప మేలు చేస్తుంది.”

“నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఆదివాసీ మహిళనైన నన్ను సర్వోన్నత పదవికి అభ్యర్థినిగా ఎంపిక చేయడం భాజపా నాయకత్వానికే చెల్లింది. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్న ప్రధానికి కృతజ్ఞతలు. అన్ని పార్టీల నేతలను కలసి మద్దతు కోరుతాను. గవర్నర్‌గా విధులు నిర్వహించిన నాకు రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవి నిర్వహించడం ఇబ్బంది కాదు.”

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. యశ్వంత్ సిన్హానే తమ ఉమ్మడి అభ్యర్థి అని అధికారికంగా ప్రకటించారు.

ఈ నెల 27న ఉదయం 11.30కి నామినేషన్ వేయనున్నట్లు పవార్ వెల్లడించారు.యశ్వంత్‌ సిన్హా కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సముఖంగానే ఉన్నారు. ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎంసీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఈ ఉదయమే ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పని చేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా ట్వీట్‌ చేశారు. టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.ఐఏఎస్ నుంచి రాజకీయాల వైపు…యశ్వంత్ సిన్హా బిహార్ పట్నాలో 1937 నవంబర్ 6న జన్మించారు. 1958లో యూనివర్సిటీ ఆఫ్ పట్నాలో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే 1962 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 1960లోనే సిన్హా ఐఏఎస్కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు సేవలందించారు. పలు కీలక పదవులు చేపట్టారు. అనంతరం 1984లో జనత పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 1986లో పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. 1988లోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ ఏర్పాటయ్యాక ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.

అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో 1990 నవంబర్ 1 నుంచి 1991 జూన్ వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.భాజపా ఏర్పాటయ్యాక 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా యశ్వంత్ సిన్హా నియమితులయ్యారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1998-2022 మధ్య కాలంలో అటల్ బిహారి వాజపేయి హయాంలో ఆర్థికమంత్రిగా సేవలందించారు. 2002-2004 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అభ్యర్థిగా సిన్హానే ఎందుకు ?

బీజేపీలో ఉంటూనే సొంత పార్టీపై గళమెత్తిన అతికొద్ది మంది నేతల్లో యశ్వంత్ సిన్హా ఒకరు. పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అయితే 2018లో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికొచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2021 మార్చి 13న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు యశ్వంత్ సిన్హా. మార్చి 15న పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఇప్పుడు రాష్ట్రపతి రేసులో ఉంటున్నందున పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాకు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలందించిన అనుభవం ఉంది. అందుకే ఆయనే రాష్ట్రపతి అభ్యర్థికి సరైన వ్యక్తి అని భావించి విపక్షాలు ఏకాభిప్రాయంతో ఆయన పేరును ఖరారు చేశాయి.సుదీర్ఘ కసరత్తు: రాష్ట్రపతి పదవికి భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు ఇప్పటికే ముగ్గురు నేతలు తిరస్కరించగా ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. రాష్ట్రపతి రేసుకు తొలుత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విముఖత చూపించగా.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ కూడా విపక్షాల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దీంతో యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. అయితే సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల్లో దింపాలంటే ఆయన టీఎంసీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, వామపక్షాలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన టీఎంసీకి రాజీనామా చేయగా విపక్ష నేతలంతా సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా ఒప్పుకున్నారు.

25న నామినేషన్
జూన్ 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగబద్ధంగా దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికయ్యే తొలి ఆదివాసీ గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించనున్నారు.

వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోండి : టీడీపీ నేత సోమిరెడ్డి

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రకటించాలని ఏపీలోని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమిరెడ్డి ఓ వీడియో ప్రకటన చేశారు.

ద్రౌపది ముర్ము గారికి ముందస్తు శుభాకాంక్షలు : సోము వీర్రాజు

భారతదేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి బీజేపీ చరిత్ర సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మాటను అక్షర సత్యం చేసి చూపించిన ప్రధాని నరేంద్రమోదీకి, అమిత్ షా, జెపి నడ్డా గారికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి మూడుసార్లు అవకాశం వస్తే మొదటి సారి ముస్లింకి, రెండవ సారి దళితునికి, మూడవ సారి గిరిజన మహిళకు అవకాశం కల్పించడం హర్షణీయం.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Su Kaçak Tespiti Nasıl Yapılır Beşiktaş su kaçak tespiti Beşiktaş su kaçak tespiti yapan Uzman, kalorifer borularında meydana gelen su kaçaklarını iki farklı yöntemle...

Lingual Support by India Fascinates