మనది పేదల ప్రభుత్వం..పేదలకు అండగా ఉండే మీ జగనన్న ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. నేను చూశాను..నేను విన్నాను..నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి వైయస్ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభించానని చెప్పారు. అధికారంలోకి వచ్చచిన నాలుగు నెలల్లో వాహన మిత్ర పథకం కింద ఒక్కో డ్రైవర్కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేసినట్లు గుర్తు చేశారు. మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు.
వాహనమిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1026 కోట్లు జమచేశాం. రూ.40వేల చొప్పున ఒక్కో కుటుంబానికి అందించాం. దేశ చరిత్రలోనే కానీ, రాష్ట్ర చరిత్రలో అయినా ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం మరొక్కటి లేదు. pic.twitter.com/cvA6vJxzx0
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 15, 2022
లం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం కోరారు. విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా నాలుగోవిడతగా ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి బటన్నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. నాలుగు విడతల్లో వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లు పంపిణీ చేయగం జరిగిందన్నారు.
వైయస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం వైయస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్లో పాల్గొన్నారు.అనంతరం మహిళా లబ్ధిదారులు సీఎం వైయస్ జగన్కు రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపారు. 2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కలి్పంచనుంది. ఒక్కో లబి్ధదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైయస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేస్తారు.
