ఏపి లో ఎన్నికలు ఇంకా కేవలం 18 నెలలే సమయం ఉండటంతో అధికార. ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో ఓటమి పాలైనా స్ధానాల్లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా వైసీపీ ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ లో ఒక పేరు అందరినీ ఆకర్షించింది. వైసీపీ కి సినిమా వారు చాలనే గత ఎన్నికల్లో సహాయ పడ్డారు, దానికి ప్రతిఫలంగా జగన్ కూడా వారికి న్యాయం చేశారు.ఇప్పుడు ఈ సందర్భంలో ఏపి రాజధాని ప్రాంతం అయినా విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో అక్కినేని నాగార్జున పేరును తాడేపల్లిలో పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. 2014,2019 లో వైసిపి అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్. పొట్లూరి వరప్రసాద్ లు పోటీ చేసి ఓడిపోయారు 2024 లో అయినా ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అందుకు ఇప్పటినుంచే వైసిపి పెద్దలు నేతల అన్వేషణలో పడ్డారు ఈ మేరకు నాగార్జున పేరును ఖరారు చేసినట్లు, కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు అని సమాచారం. అక్కినేని నాగార్జున కూడా జగన్ కు మరియు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సన్నహిత సంబంధాలు ఉండడం తో ఈ వార్తలకు బలం చేకూరుతుంది.