భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యకమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, (AKAM) ఇది భారత స్వాతంత్య్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది. 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుంది. ఈ సంధర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమలలో ప్రతిఒక్కరు పాల్గొని సమాజం లో రోజు రోజుకు పెరుగుతున్న కొత్తతరహ సైబర్ నేరాల నుండి తీసుకోవాల్సిన జాగ్రతలపైన అవగాహన కల్పించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా MHA (CIS డివిజన్), ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాలలో సైబర్ సేఫ్టీ & నేషనల్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన కార్యక్రమం 16.06.2022 (గురువారం) విశాఖపట్నంలో జరగనుంది. దీనిలో కేంద్ర హోం శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీస్ ఇతర శాఖల అదికారులు పాల్గొంటారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలు:
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, MHA (CIS డివిజన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా సైబర్ సేఫ్టీ & జాతీయ భద్రతపై విశాఖపట్నంలో 16.06.2022 (గురువారం) ఉదయం 10 గంటలకు VUDA చిల్డ్రన్స్ అరెనాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంగీత నాటక అకాడమీ వారి సాంస్కృతిక ప్రదర్శన, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి ప్రదర్శన, సైబర్ క్రైమ్లపై నిపుణుల చర్చలు, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదికాక రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రదేశాలలో సైబర్ నేరాలపైన జూన్ 16, 17, 18వ తేదీల్లో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి మరియు అనంతపురం కలెక్టర్ల సమన్వయంతో జిల్లా ఎస్పిలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పై జిల్లా కేంద్రాలలో నిర్వహించే సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లలో కలెక్టర్ల, SP/CP తోపాటు విద్యార్థులు, సాధారణ ప్రజానీకం, మహిళలు భాగస్వాములను కావాలని కోరుతున్నాము.
అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా సంబంధిత అధికారులకు జారీ చేయడం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా సైబర్ క్విజ్, ట్యాగ్లైన్ పోటీ, నినాదాల పోటీ వంటి పోటీలు నిర్వహించడంతో పాటు సైబర్ నేరాలు, సైబర్ పరిశుభ్రతపై చర్చలుతో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.