Connect with us

Hi, what are you looking for?

Andhra News

ధాన్యం సేకరణ బాధ్యత ఇక వాలంటీర్స్ దే…

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది.ఈ రంగాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

Share

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది.ఈ రంగాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ యంత్రాల పంపిణీ ప్రగతిపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది 10,750 RBK ల పరిధిలో ఇప్పటికే 6,525 RBK లలో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 1,615 క్లస్టర్‌ లెవల్‌ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. రూ.690.87 కోట్ల విలువైన పరికరాలు ప్రభుత్వం అందించిందని వీటిలో రూ.240.67 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం అందించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. ఆర్బీకేలో ఉన్న యంత్రాలు, వాటి వల్ల అందుతున్న సేవలతో సమగ్రంగా పోస్టర్లు ప్రదర్శించాలని నిర్దేశించారు. మిగిలిన ఆర్బీకేలోనూ 2022–23కి సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. వీరిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు, మిగిలిన 20 శాతం ఇతరులకు యంత్రసేవ కింద పరికరాలు అందించాలన్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 80 శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలన్నారు. దీనికోసం రూ.1,325 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వీటిలో ప్రభుత్వ సబ్సిడీగా 1,014 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు.

ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలంగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా, రైతుల ప్రయోజనాలకు ఏ విధంగానూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని సీఎం కోరారు. వీటికోసం విధి విధానాలు రూపొందించినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో అమూల్‌ పాలసేకరణపైనా సీఎం సమీక్షించారు. ప్రస్తుతం 2 లక్షల 34 వేల 548 మహిళా రైతుల నుంచి అమూల్‌ పాల సేకరణ జరుగుతుందని ఇప్పటి వరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లించినట్లు తెలిపారు. రైతులకు అదనంగా రూ.20.66 కోట్ల లబ్ది చేకూరినట్లు తెలిపారు. అమూల్‌ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం అన్నారు. ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా 2 వేల 20.46 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు అమూల్‌ పాలసేకరణ విస్తరించనున్నట్లు తెలిపారు. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ చేయనున్నట్లు తెలిపారు.

 

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Alluri Seetharama Raju

Prediksi forum Syair cambodia Hari Ini 2023     Forum syair cambodia 2023, kode syair cambodia hari ini, code syair cambodia bd, prediksi cambodia...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Lingual Support by India Fascinates