తిరుమల శ్రీవారిని విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల ఎంపీ మీడియాతో మాట్లాడుతూ సంస్కృత, సంప్రదాయాలను భారతీయులు ఇప్పటికీ కొనసాగిస్తూ వుంటడం గర్వకారణం అన్నారు.ఇక బిజేపికి తమ వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలో సపోర్ట్ చేయడంలో ఎలాంటి ధాపరికం లేదన్నారు. తద్వారా రాష్ట్రానికి సరైన సమయానికి అందాల్సిన నిధులు చేకూరుతున్నాయి అన్నారు.ప్రత్యేక హోదాపై జగన్ ఇప్పటికీ ఒకే మాటపై వున్నారు అనీ అవకాశం వచ్చిన ప్రతిసారీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు అని గుర్తుచేశారు. 2024లో అయిన అవకాశం లభిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు.