మంగళగిరిలో పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పపవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా గతంలో ఒప్పుకున్న వైసీపీ ఇప్పుడు మాట తప్పి రైతులను ఇబ్బందికి గురి చేయడం దారుణమని జనసేన అధినేత ఆవేదన వ్యక్తం చేశారు.చట్టసభల సాక్షిగా ప్రమాణాలు చేసి మాట తప్పితే ఇక వారికి విలువ ఏం ఉంటుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా 45-67 స్థానాలకే పరిమితమవుతోందని తన సర్వేలు చెప్తున్నాయి అన్నారు. పార్టీ బలోపేతం కోసం ముందుగా అక్టోబర్లో తలపెట్టిన యాత్రను వాయిదా వేయనున్నట్లు పవన్కల్యాణ్ తెలిపారు. ఈలోగా జనసేన-జనవాణి, కౌలురైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 45 నుంచి 67 సీట్లకే పరిమితం
• రాజకీయ నిపుణుల అధ్యయనాలు… సర్వేలు ద్వారా వెల్లడవుతోంది
• తదుపరి అసెంబ్లీలో జనసేన జెండా పాతుతాం
• గెలుపే లక్ష్యంగా… తపన ఉన్న వ్యక్తులే మా అభ్యర్థులు
• కప్పు కాఫీ, ముక్క పెసరట్టు కోసం ఆంధ్రప్రదేశ్ ఆస్తులు వదిలేస్తారా? pic.twitter.com/PCisOmG0MR— JanaSena Party (@JanaSenaParty) September 18, 2022
జనసేన పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలుంటే ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లమని,2014లో నేను గుడ్డిగా తెదేపాకు మద్దతు ఇవ్వలేదన్నారు.తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంలో జగన్కు శ్రద్ధ లేదా అని ప్రశ్నించారు. భవన కార్మికుల సంక్షేమ నిధులు 450 కోట్లు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులు 400 కోట్లు రూపాయలు దారి మళ్లించారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉందని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టులు పెట్టినా కేసులు, వేధింపులకు గురి చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికీ ఎక్స్పెయిరీ డేట్ ఉంటుందని అలాగే మనిషికీ, అధికారానికీ ఎక్స్పెయిరీ డేట్ ఉంటుందని గ్రహించాలని హితవు పలికారు.