తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం లో “బాదుడే బాదుడు” కార్యక్రమం లో పాల్గొన్నారు. స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని మంగళగిరి స్థానికులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు లాగేస్తున్నారు అని లోకేష్ విమర్శించారు. సంక్షేమం గోరంత బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత అన్నారు. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారని పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలన్నారు.
అదే సమయంలో నారా లోకేష్ వైసీపీ నేత ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను నారా లోకేష్ ట్విట్టర్ లో పంచుకున్నారు. నారా లోకేష్ వెంట టీటీపీ నేతలు కూడా ఉన్నారు.
మంగళగిరి నియోజకవర్గం వైసిపి నేత, దుగ్గిరాల మాజీ ఎంపిపి, మాజీ పిఏసిఎస్ చైర్మన్ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ గారి నివాసానికి వెళ్లి పరామర్శించాను. pic.twitter.com/bCH3c5uSjK
— Lokesh Nara (@naralokesh) September 27, 2022