వైయస్ వివేకానందరెడ్డి హత్యతో ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. బాబాయ్ హత్యతో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణానికి సీఎం జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు.వివేకా హత్య విషయంలో తమ కుటుంబంపై జగన్ బ్యాచ్ ఆరోపణలను ఖండిస్తూ వేంకటేశ్వర స్వామి సమక్షంలో గతేడాది తాను ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ ప్రమాణం చేయకపోతే గొడ్డలి పోటు జగనాసుర రక్తచరిత్ర అని అంగీకరిస్తారా అని నిలదీశారు.
వివేకా గారి హత్య తో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21 న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా జగన్ రెడ్డి?. తిరుమల వెళ్తున్న మీరు ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా?’అంటూ ట్వీట్ చేసి సవాల్ విసిరారు.
వివేకా గారి హత్య తో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21 న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్ హత్య తో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా జగన్ రెడ్డి?(1/2)#AbbaiKilledBabai
— Lokesh Nara (@naralokesh) September 27, 2022
వైఎస్ వివేకా హత్య కేసులో జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఆయనే కీలక వ్యక్తి అని బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో శివశంకర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివశంకర్రెడ్డే అని జడ్జి వ్యాఖ్యానించారు సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశాలున్నాయి అన్నారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది.