ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిఅక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్నారు కాగా తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్పై విచారణ పూర్తి చేసిన ఎనిమిది నెలల తర్వాత తీర్పు ను హై కోర్టు ప్రకటించింది. జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించినప్పుడు మాత్రం జగన్ హాజరు కావాలని స్పష్టం చేసింది.
అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ మొదట సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ కోర్టు తిరస్కరించడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారని రోజూ విచారణకు హాజరైతే పాలనకు అటంకం కలుగుతుందని జగన్ తరపు లాయర్లు వాదించారు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి శుక్ర వారం హాజరయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో 11 కేసులున్నాయి. అందువల్ల విచారణకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిసారి హాజరుకావడం సాధ్యం కాదు. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు.
అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ ప్రారంభమైతే జగన్ రోజూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆయన ఏపీలో సీఎంగా విధులు నిర్వర్తించడం అసాధ్యం. కేవలం కోర్టుకు సెలవులో మాత్రమే ఆయన ఏపీలో ఉండే అవకాశం ఉండేది. అయితే కోర్టు మినహాయింపు ఇవ్వడం సీబీఐ కోర్టు అడిగినప్పుడుహాజరు కావాలనే షరతుతో ఆయన న్యాయవాది హాజరయ్యేందుకు అంగీకరించడంతో ఊరట లభించినట్లయింది.హైకోర్టు తీర్పుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.