ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్ద్యోగులు తలపెట్టిన “ఛలో విజయవాడ”, సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా ప్రస్తుతానికి వాయిదా వేయించ గలిగింది. పోలీస్ బలం ఉపయోగించి, నాయనో భయానో ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ఆపింది. కానీ ఉద్ద్యోగ సంఘాలు ఎక్కడా తగ్గేదే లేదు అంటున్నాయి. ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చాం మా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చకపోతే మరింత పకడ్బందీగా కార్యక్రమమని నిర్వహిస్తామని అంటున్నాయి.
సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ వాయిదా పడింది. రాష్ట్రంలో తమకు ఇబ్బందికర వాతావరణం ఉండటంతో వాయిదా వేసుకోవాలని CPS ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఎక్కడికక్కడ నిరనసలు, ఆందోళనలు కొనసాగుతాయని APCPSEA స్పష్టం చేసింది. పోలీసులు, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని సెప్టెంబర్ 1కి బదులుగా అదే నెల 11వ తారీఖున “చలో విజయవాడ” నిర్వహించాలని నిర్ణయించనున్నట్లు నేతలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను ఎక్కడికక్కడ బైండోవర్ చేస్తుండటంతో పాటు నోటీసులు జారీ చేయడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు సెప్టెంబరు ఒకటో తేదీన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చే సీపీఎస్ ఉద్యోగులకు ఎక్కడా ఆహారం దొరక్కుండా టిఫిన్ మరియు భోజన హోటళ్లను కూడా మూసివేయాలంటూ పోలీసులు అనధికారికంగా హుకుం జారీ చేశారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.






