వైసీపీకి సమయం దగ్గరపడిందని అందుకే వికేంద్రీకరణ అంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.రాజధానులు ఏర్పాటు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఇవ్వాలని గతంలో పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టారని అది తెలియకుండానే ఎంపీ పిల్లి సుభాష్ మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ చేసే పనులు జుగుప్సాకరంగా ఉన్నాయి అన్నారు రఘురామ విమర్శించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారని మంత్రి రోజా అనడంలో తప్పులేదు అన్నారు రఘురామ కృష్ణంరాజు. ముఖ్యమంత్రి తన తల్లిని, సోదరి సునీత,చెల్లి షర్మిలను కూడా అలానే చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని భాషలో తప్పులేదంటే బహుశా రోజా భాష కూడా అదే అయ్యుంటుందని కొడాలి నాని భాష రోజాకు అర్ధం కాకపోవచ్చునని రఘురామ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
DOPT లో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్పై గతంలో ఫిర్యాదు చేశానన్నారు. బాధ్యతగల పదవిలో ఉండి అంబేద్కర్ మిషన్ సంస్థను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. సునీల్ కుమార్పై డీవోపీటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వారం రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో సునీల్పై ఫిర్యాదు చేస్తానని ఎంపీ రఘురామ అంటున్నారు.
విశాఖ ప్రజలు తమ ప్రాంతాన్ని రాజధానిగా కోరుకోవడం లేదని అక్కడి ప్రజలు నిన్నటి మొన్నటి వరకు స్థానికంగా కబ్జాలను చూశారా అని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారని ఏమి జరిగినా తమకు సంబంధం లేదని పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రపై కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో అధికారుల నిఘా ఉంటుందని ఈ మేరకు తాను కూడా హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని చెప్పుకొచ్చారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ 2024 సాధారణ ఎన్నికలలో మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎన్నికలకు వెళ్తామని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని రెఫరెండంగా పేర్కొంటూ ఎన్నికలకు వెళితే ప్రజలు ఏమి చేస్తారో, ఎలా సత్కరిస్తారో, ఎలా గౌరవిస్తారో అందరం చూస్తామన