సీఎం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు’’ అని అన్నారు. కోవిద్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారని మండిపడ్డారు. నారా లోకేష్ విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు. 2020లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్పై పోలీసులు నమోదు చేశారు. దీంతో కేసు విచారణలో భాగంగా లోకేష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చారు.
నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారని ప్రశ్నించారు. కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని, సీఎం మాదిరిగా వాయిదాలు తీసుకోవట్లేదని వ్యాఖ్యానించారు. 2016 నుంచి తపపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని.. తన అవినీతి కేసులపై చర్చకు సీఎం జగన్ సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు. టీడీపీ తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని, జగన్ లా వాయిదాలు తీసుకోవట్లేదన్నారు. ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటున్నారన్నారు. పోలవరం పూర్తి చేస్తానంటూ సవాళ్లు చేసిన ఓ మంత్రి నాకు సంబంధం లేదంటున్నారన్నారు. జలవనరులపై అవగాహన లేని మరో వ్యక్తి ఇప్ప్పుడు మంత్రి అయ్యారని తెలిపారు. సీఎం దావోస్ పర్యటన వైసీపీ పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని వ్యాఖ్యానించారు. ఆదానీని కలిసేందుకు దావోస్ దాకా వెళ్ళారా ? అని నిలదీశారు. జగన్ రెడ్డి దేశం వదిలి వెళ్ళాక పెట్రోల్ ధరలు తగ్గాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమ అయినా చెప్పగలరా అంటూ లోకేష్ ప్రశ్నించారు.