ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. కేవలం గడప గడపకు లాంటి కార్యక్రమాలతో సరిపెట్టకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి కావలసిన నిదులను విడుదల చేసింది.ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలో వుండి వారి అవసరాలు తీర్చేలా కార్యాచరణలు చేపట్టింది.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాల యాల పరిధిలోని ప్రజలకు అత్యంత అవసరమైన ఆర్థిక పరమైన పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,000.80 కోట్లు మంజూరు చేసింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు స్థానిక ప్రజలకు అవసరమైన,పనులను మం జూరు చేయడానికి ఒక్కో గ్రామ,వార్డు సచివాల యానికి 20 లక్షల రూపాయల చొప్పున 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం రూ.3,000.80 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఎలాంటి పనులు మంజూరు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రణాళికాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యధిక ప్రభావం చూపే ఆస్తుల కల్పన పనులనే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కనిష్టంగా ఒక్కో సచివాలయ పరిధిలో రూ.లక్ష, గరిష్టంగా రూ.20 లక్షల పనులను అనుమతించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో నోడల్ అధికారులుగా వ్యవహరించే మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్లు పనులను గుర్తించాలని చెప్పింది.
సచివాలయాల సందర్శన తప్పనిసరి:
ప్రతి నెలా ఎమ్మెల్యే కచ్చితంగా ఆరు సచివాల యాలను సందర్శించాలి. ప్రతి సచివాలయాన్ని 2 రోజుల పాటు సందర్శించాలి. ఎమ్మెల్యే సందర్శన షెడ్యూల్ ను పది రోజుల ముందుగానే నోడల్ అధికారులకు తెలియజేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల,మున్సిపల్ స్థాయి అధికారులు పాల్గొనాలి.
సచివాలయ సందర్శన రెండు రోజుల్లో ఎమ్మెల్యే తో కూడిన అధికారుల బృందం అత్యధిక ప్రభావం చూపే పనులను గుర్తించాలి. ప్రజల వినతుల ఆధారంగా లేదా స్థానిక ప్రజల అవస చేపట్టాల్సిన పనులు ఆధారంగా అత్యధిక ప్రభావం చూపే పనులు గుర్తించాలి. పారిశుద్ధ్యం, నిర్వహణ, మరమ్మతులు వంటి సాధారణ పనులను సంబంధిత సచివాలయాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. ఖరారు చేసిన పనుల జాబితాను గడప గడపకు మన ప్రభుత్వం పోర్టల్లో నోడల్ అధికారి అప్లోడ్ చేయాలి. పనులకు సంబంధించిన తీర్మానం, లైన్ ఎస్టిమేట్ డాక్యుమెంట్తో పాటు సమస్య ఫొటోను నిర్ణీత ఫార్మాట్లో పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి. మొత్తం ఈ పనుల ప్రక్రియను, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పర్యవేక్షిస్తుంది.
ముఖ్యంగా చేయాల్సిన పనులు:
తాగునీటి సరఫరా పనులు: తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్మాణాల స్థాయి పెంపు, తాగు నీటి సరఫరా పైపు లైన్లు, ట్యాంక్ లు.
విద్యుత్: కొత్త ఎలక్ట్రికల్ లైన్, పోల్, కమ్యూనిటీ కి అవసరమైన కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్.
డ్రైన్స్: ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం, వరద నీటి
రహదారుల పనులు: సిమెంట్ కాంక్రీట్ రహదారుల నిర్మాణం, సిమెంట్ కాంక్రీట్ రహ దారుల స్థాయి పెంపు, తారు రోడ్ల నిర్మాణం, తారు రోడ్ల స్థాయి పెంపు.
కల్వర్టులు: కల్వర్టుల నిర్మాణం, కమ్యూనిటీ కోసం డ్రైనేజీలను దాటే నిర్మాణాలు. దాటే.
ఇతర సివిల్ పనులు: కమ్యూనిటీ షెల్టర్ భవనాలు, కమ్యూనిటీ భవనాలకు ప్రహరీ గోడల నిర్మాణం, కమ్యూనిటీకి సంబంధించి వరద నివారణ, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు.
ఈ ప్రణాళికలతో అధికార పార్టీ రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతుండగా, ప్రజా అవసరాలను వేగంగా తీర్చి మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తమ ఎమ్మెల్యేలను ప్రజలలో నిత్యం వుంచి ప్రజా మన్ననలు పొందాలని తద్వారా రాబోయే ఎన్నికలలో విజయం వరిస్తుందని జగన్ ఆలోచన అని పార్టీ వర్గాలు తెలిపాయి.