ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘స్పందన’ కార్యక్రమంపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు,ప్రతి అధికారి స్పందన కార్యక్రమంలో పాల్గొనాలని అప్పుడే 50 శాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు. రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలలోపు సచివాలయాల వద్ద స్పందన కార్యక్రమం జరగాలని స్పందనకు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారం అయితే పరిష్కరించిన అధికారి పిటిషనర్తో సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాల్సిందే అన్నారు. ఇది ప్రజల్లో సంతృప్త స్ధాయిని పెంచుతుందని అలాగే ప్రతి కార్యాలయంలో ఏసీబీ నంబర్ కచ్చితంగా అందరికి కనిపించేలా ఉంచాలని సూచించారులేని పక్షంలో సంబధిత శాఖాధికారిపై చర్య తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.
ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 21నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ –3 కింద డిసెంబర్లో ఇళ్ల మంజూరు చేయాలని చెప్పారు. ఎస్డీజీ సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమన్నారు. అక్టోబరు 25న ఈ–క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఈ మేరకు షెడ్యూల్ వివరించారు. జాతీయ రహదారులకు కావాల్సిన భూసేకరణ, వైఎస్సార్ అర్బన్-విలేజ్ క్లినిక్స్ పై సూచనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే నెలలో 6 సచివాలయాలకు వెళ్ళాలని ఆ తర్వాాత మరో 6 సచివాలయాలకు వెళ్లేటప్పటికి ముందు వెళ్లిన సచివాలయాలలో పనులు మొదలవ్వాలి అన్నారు. ఈ క్రాప్పై ప్రతి కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని డిజిటల్ లైబ్రరీ బిల్టింగ్లకు అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయిస్తామన్నారు.