పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ- ఆప్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఓ అవినీతి మంత్రిని గుర్తించి అతడిపై వేటు వేయడం సంచలనం సృష్టించింది. అభివృద్ధి పనుల నుంచి తనకు వాటా ఇవ్వాలని, ప్రతి టెండరు నుంచి 1 శాతం కమీషన్ ఇవ్వాలంటూ పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి తెరలేపిన విషయాన్ని సీఎం భగవంత్ మాన్ బట్టబయలు చేశారు.
అంతేకాదు, సింగ్లాపై కేసు నమోదు చేయాలంటూ ఏసీబీకి సిఫారసు చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం సిఫారసు నేపథ్యంలో ఏసీబీ అధికారులు అవినీతి మంత్రి విజయ్ సింగ్లాను అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అవినీతి విషయంలో ఏమాత్రం ఉపేక్షించకుండా, మంత్రిని సైతం తొలగించిన సీఎం భగవంత్ మాన్ నిబద్ధత తనను కదిలించి వేసిందని, కళ్లలో నీళ్లు తిరిగాయని పేర్కొన్నారు. “భగవంత్… నీ పట్ల గర్విస్తున్నాను. ఆప్ ను చూసి ఇవాళ దేశమంతా గర్విస్తోంది” అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
మరీ మన ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళద్దమా ఈ విషయం మీద అంటూ మన సామాన్య ప్రజానీకం తెగ చెవులు కొరుక్కుంటున్నారు.
మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకుంటే మంత్రి వర్గంలో దాదాపు అందరికి టాటా గుడ్ బాయ్ వీడుకోలు అని చెప్పొచ్చు అంటున్నారు.
మరికొందరేమో అస్సలు ఆ హిట్ లిస్ట్ లో ఉండేది మన ముఖ్యమంత్రిగారే..అస్సలు ఆయన ఎందులోనూ తగ్గరుగా…..తగ్గేదేలే అంటూ…… అవినీతి హిట్ లిస్ట్ లో ఉంటారేమో…..అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.