ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను సీఎం జగన్ ప్రారంభించారు. పింగళి వెంకయ్య జీవితచరిత్రపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన సీఎం జగన్, ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ళ మల్లిఖార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ.కృష్ణమోహన్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణ్కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, సమాచార శాఖ కమిషనర్ తమ్మా విజయ్కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు, పోలీస్ అధికారులు.
