వైసీపీ పార్టీ అప్పగించిన గడప గడపకూ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో నిర్వహించని 27 మంది ఎమ్మెల్యేల మీద సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో నిర్వహించిన వర్క్ షాప్లో జగన్ ప్రసంగించారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్నిసీరియస్గా తీసుకోడం లేదని మొత్తం 27మందిపై జగన్ ఫైరయ్యారు. అందులో నలుగురు మంత్రులు ఉన్నారు. వీరందరూ ఇక నుంచి వారానికి మూడునాలుగు రోజులు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాల్సిందేననిస్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఓ గంట తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని వారందరి పనితీరుపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామని పనితీరు మార్చుకోకపోతే ఈ సారి టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు.
వర్క్ షాప్నకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఎన్నికల దాకా గడపగడపకు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. గడపగడపకు కార్యక్రమంలో పనితీరు బాగా లేని వారి సంఖ్య 27గా తేలిందని చెప్పిన జగన్, అయితే నవంబర్లో మరోమారు గడపగడపకుపై సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పటిలోగా పనితీరు బాగా లేని వారు పనితీరు మెరుగుపరచుకోవాలని జగన్ సూచించారన్నారు. 2024 ఎన్నికల్లో 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారని సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు తెలిపారు. ఎవరి పనితీరు బాగా లేదో వారికే ఈ విషయం బాగా తెలుసునని జగన్ వివరించినట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు.
జగన్ తెలిపిన 27 మందిలో ఆరేడుగురు మంత్రులు కూడా ఉన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నందున సీరియస్గా తిరగలేకపోతున్నామని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటివేమీ ఉండవని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గడప గడపకూ వెళ్లాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.
నవంబర్ ఆఖరి వారంలో మరోసారి మీటింగ్ ఉంటుందని ఎవరి పనితీరు ఏంటి అనేది చివరి ఆరు నెలల్లో చెబుతానని అప్పుడే టిక్కెట్లు ఇచ్చేది లేనిది కూడా చెబుతామని జగన్ క్లియర్ గా చెప్పేశారు. మాజీ మంత్రులు బాలినేని, అళ్ల నాని పని తీరు పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని దొంగదారులు వెతకవద్దని జగన్ వారికి మొహం మీదనే చెప్పారు. నలుగురు మంత్రులు మాజీ మంత్రులు కాకుండా జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల్లో గ్రంధి శ్రీను, ధనలక్ష్మి, అధిప్ రాజ్, కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.